Friday, April 26, 2024

కొత్త కథ, కథనాలు చూస్తారు

- Advertisement -
- Advertisement -

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి‘. ఈ సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. నిర్మాత నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ “లవ్ స్టోరి సినిమా గత ఏడాది విడుదల చేయాల్సింది. లాక్ డౌన్ వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు థియేటర్‌లలో సినిమాను విడుదల చేస్తున్నందుకు థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాం. లవ్ స్టోరి మంచి ఎమోషన్స్ ఉన్న ఫీల్ గుడ్ మూవీ. థియేటర్ లలోనే ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేయగలం. అందుకే ఓటీటీలు ఎన్ని సంప్రదించినా మా చిత్రాన్ని ఇవ్వలేదు”అని అన్నా రు. నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ “ఇప్పుడు పరిస్థితి మెరుగు పడడంతో థియేటర్ ల ద్వారా ఈనెల 24న లవ్ స్టోరి చిత్రా న్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. గత ఏప్రిల్‌లో మా సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ అదే టైమ్‌లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజైంది. దాంతో మా చిత్రాన్ని వాయి దా వేశాం. లవ్ స్టోరి చిత్రంలో పాటలు చాలా హిట్ అయ్యాయి. శేఖ ర్ కమ్ముల తరహా కొత్త కథ, కథనాలు సినిమాలో చూస్తారు. ఆయన స్టైల్‌లోనే కొత్త కథను చూపించబోతున్నారు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News