Monday, May 6, 2024

స్తంభాన్ని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కరకట్టపై కారు స్తంభాన్ని ఢీకొట్టి అనంతరం కెఇబి కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. కారు కాలువలో పడగానే స్థానికులు స్పందించి వాహనం అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. అనంతరం ట్రాక్టర్లతో సహాయంతో కారును నీళ్లలోంచి బయటకు తీశారు. చిరువోలుకు చెందిన ఓ కుటుంబ  విజయవాడకు వెళ్లి సొంతూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. కరకట్టకు ఇరువైపులా బలమైన ఇనుపకంచె ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News