- Advertisement -
ఖమ్మం: ప్రేమ పేరుతో లోబరుచుకొని యువతిని(17) మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జికె బంజరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జికె బంజార్ గ్రామంలో శరత్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటాలతో నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమ్మని కోరితే ఐదు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. తల్లిదండ్రులకు కట్నం ఇచ్చే స్తోమత లేకపోవడంతో యువతి పురుగుల మందు తాగింది. గ్రామస్థులు గమనించి యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. గ్రామ స్థాయి నాయకులు జోక్యం చేసుకొని కేసు లేకుండా చేద్దామనుకున్నారు. కానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపాడు.
- Advertisement -