Sunday, April 28, 2024

ప్రేమ పేరుతో పెళ్లి… అల్లుడిని చంపిన మామ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వేధించడంతో అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఫలక్ నుమాలోని అబ్దుల్ షారూక్(24) మైలార్ దేవ్ పల్లి ఉండే అన్వర్ కూతురును ప్రేమిస్తున్నానని వెంటపడడంతో అతడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన షారూఖ్ మామా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆయన కూతురుని పెళ్లి చేసుకున్నాడు. మామా ఇంటికి ఫోన్ చేసి తనతో కూతురు పంపించాలని డిమాండ్ చేశాడు. అప్పటికే షారూక్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన కూతురును వేధిస్తున్న అల్లుడిని అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అన్వర్ తన అల్లుడు షారూక్ కు ఫోన్ చేసి శాలిబండకు వెళ్ధామన్నాడు. యాక్టివ్ ను అల్లుడు నడుపుతుండగా మామ వెనక కూర్చున్నాడు. ఫలక్ నుమా డిపో ఎదురుగా రాగానే చాకుతో షారూఖ్ గొంతులో పొడిచాడు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News