Friday, April 26, 2024

విశాఖలో ఇంటర్ విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

Lover who strangled an inter student in Visakhapatnam

 

మనతెలంగాణ/హైదరాబాద్‌: ఇంటర్మీడియట్ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసి హత్యగావించిన ఘటన శనివారం నాడు గాజువాక సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వెంటాడుతున్న యువకుడు కత్తితో తీవ్రంగా గాయం చేయడంతో ఇంటర్ విద్యార్థిని అక్కకక్కడే యువతి మృతి చెందింది. విశాఖలోని వరలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతుకోశాడు . దీంతో తీవ్రరక్త స్రావం కావడంతో అక్కడికక్కడే విద్యార్థిని మృతి చెందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ యువకుడి అఖిల్ గా గుర్తింయి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం వెనక ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నడిరోడ్డుపై పడివున్న వరలక్ష్మి మృతదేహాన్ని కెజిహెచ్ కు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News