Tuesday, April 30, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 15 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. కైల్ మేయర్స్ 29 పరుగులు చేసి హరప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో హర్ప్రీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీపక్ హుడా రెండు పరుగులు చేసి రాజా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా 18 పరుగులు రబడా బౌలింగ్‌లో షారూఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. నికోలస్ పూరన్ రబడా బౌలింగ్‌లో షారూక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్ (54), మార్కస్ స్టయినీస్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News