Saturday, May 4, 2024

భర్త ప్రాణం తీసిన భార్య ఐదో వివాహం

- Advertisement -
- Advertisement -

భోపాల్: భార్య అయిదో వివాహం చేసుకోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2018లో ఇండోర్‌కు చెందిన సునీల్ లోహానీ అనే వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరగాయి. అవి తారాస్థాయికి చేరుకోవడంతో తన తల్లిదండ్రుల వద్దకు ఆమె వెళ్లిపోయింది. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని సునీల్‌కు తెలిసింది. ఈ విషయం తెలిసినప్పటికి అతడు మనస్థాపానికి గురయ్యాడు. సూసైడ్ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి అనంతరం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్‌పై ఆమె వరకట్న వేధింపుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు కేసుతో విసిగిపోయిన అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News