- Advertisement -
చెన్నై: మద్రాస్ హైకోర్టు క్రీడా, సినీ సెలబ్రెటీలకు షాక్ ఇచ్చింది. ఆన్లైన్ రమ్మీ నిషేధం కేసుపై మద్రాస్ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆన్ లైన్ రమ్మీలో డబ్బు కోల్పోయి అనేకమంది ప్రాణాలు తీసుకుంటున్నారని పిల్ దాఖాలైంది. ఓ వ్యక్తి ఆన్లైన్ జూదం రమ్మీని నిషేధించాలని పిల్ వేశాడు. విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన కోర్టు ఆన్ లైన్ జూదం డబ్బు ఎక్కడికి పోతోంది? అని ప్రశ్నించింది. క్రీడా, సినీ సెలబ్రెటీలు ఆన్లైన్ బెట్టింగ్ వైబ్సైట్లకు ప్రచారం చేయడం సరికాదని సూచించింది. ఈ క్రమంలోనే ప్రచారకర్తలుగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, నటులు రానా, తమన్నా, సుదీప్, ప్రకాష్ రాజ్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 19లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
- Advertisement -