తాండూరు: ట్రాక్టర్, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మణం చెందిన సంఘటన తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండలం గిర్మాపూరు గ్రామానికి రామప్పతోపాటు మరికొంత మంది మహిళలు కలిసి ఆటోలో తాండూరుకు వెళ్తున్నారు. మార్గమద్యలోని అంతారం సమీపంలో తాండూరు మున్సిపల్కు చెందిన చెత్త ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఆటో వెనుక భాగానతాకడంతో ఆటోలో ప్రయాణిస్తున్న రామప్ప(50) కింద పడిపోయి కాళ్లు నుజ్జునుజ్జు అయి అక్కడిక్కక్కడే దుర్మణం చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న గిర్మాపూరు గ్రామానికి చెందిన బాలప్ప, మరో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన రామప్ప శవానికి పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ గిరి తెలిపారు.
Man Died in Tractor auto collision at Tandur