- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం నుంచే దుమ్ము తుఫాన్ ఢిల్లీని చుట్టుముట్టింది. తాజాగా ఢిల్లీ, ఎన్సిఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లోని కొన్ని ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.5గా నమోదైనట్లు భూకంప పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్థినష్టం కానీ, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
Magnitude 3.5 Earthquake hits Several Areas in Delhi
- Advertisement -