- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఓవైపు కరోనా, మరోవైపు దుమ్ము తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయి వాతావరణం చల్లబడింది. ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీ, ఎన్సిఆర్, నోయిడాతోపాటు సమీప ప్రాంతాల్లో భారీగా దుమ్ము అలుముకుంది.ఆకాశమంతా మబ్బులు పట్టి, ఈదురు గాలులతో కూడిన దుమ్ము, ధూళి భారీగా రోడ్లు, ఇళ్ల మీద పడుతున్నాయి. దీంతో కొందరు ఢిల్లీని చుట్టుముట్టిన దుమ్ము తుఫాన్ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
#Noida, midday. pic.twitter.com/EVGSczk58Z
— Ananya Bhattacharya (@ananya116) May 10, 2020
Heavy Dust storm hits Delhi-NCR
- Advertisement -