సూపర్ స్టార్ మహేష్బాబు తన నెక్స్ మూవీ షూటింగ్కి సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకుడు పరుశురామ్తో చేస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ను సెప్టెంబర్లో మొదలుపెట్టాలని ఫిల్మ్మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీ కథపై ఇప్పటికే కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఈ మూవీ ఆర్ధిక నేరాలపై తెరకెక్కే క్రైమ్ అండ్ రివేంజ్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంపై మరో ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. మహేష్ ఈ చిత్రంలో మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ఆయన రెండు భిన్నమైన స్వభాలు కలిగిన ట్విన్స్గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. బాలనటుడిగా డ్యూయల్ రోల్ చేసిన మహేష్… హీరోగా మారిన తరువాత చేయలేదు. మరి ఈ సూపర్స్టార్ ‘సర్కారు వారి పాట’ మూవీతో ఆ ఫీట్ చేసే అవకాశం కలదని అంటున్నారు. మరి ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుండో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తే చూడాలని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా…తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ట్విన్స్గా కనిపించే సూపర్స్టార్?
- Advertisement -
- Advertisement -
- Advertisement -