Monday, May 13, 2024

పోలీసులపై రెచ్చిపోయిన పోకిరీ

- Advertisement -
- Advertisement -

man attempted to attack police in Rajendra Nagar

హైదరాబాద్: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ లో యువకుడు హల్ చల్ చేశాడు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులపై పోకిరీ దాడికి ప్రయత్నించాడు. యువకుడు లాక్ డౌన్ సమయంలో బైక్ పై మాస్క్, హెల్మెట్ కూడా లేకుండా తిరుగుతున్నాడు. దీంతో యువకుడ్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నావంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో నాబైకే ఆపుతావా అంటూ బండరాయి తీసి కానిస్టేబుల్ పై దాడికి యత్నించాడు. పోలీసులను బూతులు తిడుతూ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వ్యవహారమంతా స్థానిక యువకులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News