Monday, April 29, 2024

కరోనాతో రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

Rajanna Sirisilla Additional Collector with Corona dies

రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో కరోనా బారినపడి పలువురు ఉన్న‌తాధికారులు చనిపోతున్నారు. తాజాగా మరో అధికారి కరోనాకు బ‌లయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) కన్నుమూశారు. అంజ‌య్య‌కు 10 రోజుల క్రితం క‌రోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో కుటుంబీకులు ఆయ‌న‌ను న‌గ‌రంలోని ఓమ్ని ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న అంజ‌య్య‌ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. అంజ‌య్య మృతిప‌ట్ల మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అంజయ్య మృతితో మంచి అధికారిని కోల్పోయామని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా క‌లెక్ట‌రేట్ సిబ్బంది కూడా ఆయన మృతిపట్ల సంతాపం ప్ర‌క‌టించి, ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు.

Rajanna Sirisilla Additional Collector with Corona dies

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News