- Advertisement -
మంచిర్యాల: జిల్లాలోని తాండూరు మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తిర్యాని మండలానికి చెందిన తొడసం భగవంతరావు అనే వ్యక్తి వేగంగా వచ్చి బైక్ అదుపుతప్పడంతో నీలాయిపల్లి రహదారి పక్కన చెట్టుకు ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు సమాచారంతో ఘటనస్థలాన్ని తాండూరు సిఐ బాబురావు తోపాటు మాదారం ఎస్ఐ మానస పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Man Death in Road Accident At Mancherial
- Advertisement -