ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్లో మరో నయా మోడల్ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ఆగస్టు 6వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అమెజాన్ ఇండియా, శాంసంగ్ డాట్కామ్ల ద్వారా ఈ ఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయొచ్చునని కంపెనీ పేర్కొంది. గెలాక్సీ ఎం31ఎస్ ఫోన్ ప్రారంభధర రూ.19,999కాగా టాప్ఎండ్ మోడల్ ధర రూ.21,999గా ఉంది. ఈ ఫోన్ లో ఎన్నో అద్భుత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ టేక్ కెమెరా మోడ్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒకేసారి ఫొటోలు, వీడియోలు తీసే సౌలబ్యం కలదు. సింగిల్ టేక్ ఫీచర్ శాంసంగ్ ప్రీమియం గెలాక్సీ ఫోన్లలో ఉంది. ఈ ఫోన్ మిరాజ్ బ్లూ, మిరాజ్ బ్లాక్ కలర్స్ వేరియంట్లలో విడుదలైంది.
గెలాక్సీ ఎం31ఎస్… అద్భుత ఫీచర్లు….
6.50 అంగుళాలు డిస్ప్లే,
శాంసంగ్ ఎక్సీనోస్ 9611 ప్రాసెసర్,
32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 64+12+5+5 మెగా పిక్సల్ రియర్ కెమెరా
6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్
6000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10ఒఎస్ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.