Friday, April 26, 2024

ట్రాక్టర్‌తో ఢీకొట్టి.. కత్తులతో నరికి!

- Advertisement -
- Advertisement -
man killed Buffaloes with knife in Sirsinagandla
సిరిసినగండ్లలో గేదెలను చంపిన దుండగులు.. పోలీసుల అదుపులో నిందితుడు, ముగ్గురు పరారీ

కొండపాక: ట్రాక్టర్‌తో ఢీకొట్టి, కత్తులతో నరికి గేదెలను అతి కిరాతకంగా చంపి, వాటి తుంటి భాగాలను, పొదుగులను కోసి వండుకునేందుకు తీసుకెళ్లిన దారుణమైన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్లలో చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీ టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజగిరి వెంకటేశం తన రెండు గేదెలను ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద కట్టి వెళ్లిపోయాడు. శనివారం తెల్లవారుజామున గేదెలను మేపేందుకు పొలం వద్దకు వెళ్లగా అవి చనిపోయి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అక్కడికి వచ్చి చూడగా గేదెలను చంపి వాటి తుంటి భాగంతో పాటు ఒక కాలును, పొదుగును కత్తులతో కోసి మాంసం తీసి ఉండడం చూసి ఆందోళనకు గురయ్యారు.

దీంతో స్థానికులంతా కలిసి గేదెలను చంపిన వారి కోసం గ్రామశివార్లలో గాలించగా దమ్మక్కపల్లి గ్రామ శివారులోని రాజేందర్‌రెడ్డికి చెందిన మామిడి తోటలో ఉన్న ఓ గదిలో గేదె మాంసం లభ్యమైంది. దీంతో జరిగిన విషయంపై స్థానికులు ఆరా తీయ గా నేపాల్ దేశానికి చెందిన సునార్, మరో ముగ్గురితో కలిసి ఈ ఘాతు కానికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమా చారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ సిఐ ప్రవీణ్‌కు మార్ నిందితుడితో పాటు మామిడితోట పర్యవేక్షకుడు మేకల మల్లేశం ను అదుపులోకి తీసుకున్నాడు. కాగా మరో ముగ్గురు నిందితులు పరారీ లో ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలంలో వినియోగించిన ట్రాక్టర్, క త్తులను సిఐ స్వాధీనం చేసుకున్నారు.

man killed Buffaloes with knife in Sirsinagandla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News