- Advertisement -
అమరావతి: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో రెండవ టర్నింగ్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెదక్ జిల్లాకు చెందిన శివలింగం గౌడ్ అనే 39 ఏళ్ల వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు శివలింగం గౌడ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Man Killed in Road Accident in Tirumala Ghat Road
- Advertisement -