Sunday, April 28, 2024

వివాహిత అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆఫీస్‌కు వెళ్లుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ తిరిగి రాకపోడంతో ఆమె భర్త జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన శుక్రవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లక్ష్మీనగర్ కాలనీలో చోటుచేసుకుంది.ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్ కాలనీలో నివసించే నల్లా డేవిడ్,కొడతల జాగృతిలు(31)లు 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కాగా డేవిడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా,జాగృతి ఎయస్‌రావునగర్‌లో హోమ్ కేర్ ఉద్యోగం చేస్తుంది.

ఈ రోజు ఉదయం జాగృతి ఉద్యోగానికి వెళ్లుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్చ్ ఆఫ్ చేసుకుంది.చుట్టు పక్కల,బంధువుల ఇళ్లలో వెతికిన భార్య ఆచూకి లభ్యం కాకపోడంతో భర్త డేవిడ్ జవహర్‌నగర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News