Thursday, May 2, 2024

అనుమానస్పదస్థితిలో వివాహిత హత్య

- Advertisement -
- Advertisement -

Married Woman murder under suspicious circumstances

 

భర్త చంపాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
లక్ష రూపాయలు అదనపు కట్నం తేవాలని ఒత్తిడి

మనతెలంగాణ, హైదరాబాద్ : అనుమానస్పదస్థితిలో వివాహిత మృతిచెందిన సంఘటన నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. నగరంలోని మేరాజ్ బేగంకు 14 నెలల క్రితం ఇమ్రాన్‌తో వివాహం జరిగింది. ఇమ్రాన్ వంటవాడిగా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో వరుడికి కట్న కానుకల కింద అన్ని లాంఛనాలు ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే బాధితురాలిని అదనపు కట్నం తీసుకురావాలని భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారు.

లక్ష రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలని రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో పాటు తరచూ కొట్టేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం బాధితురాలిని కొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందింది. అదనపు కట్నం కోసం ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, వేధింపులకు గురిచేయడమే కాకుండా దాడి చేయడంతో మేరాజ్ బేగం మృతిచెందిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కుల్సుంపుర పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News