హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హైదరాబాద్లోని హకీంపేట్కు చేరుకుంది. అంతకుముందే హకీంపేట్కు చేరుకున్న గవర్నర్ తమిళిసై, కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి నివాళులర్పించారు. గవర్నర్తోపాటు మంత్రులు కెటిఆర్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు ఆయనకు నివాళి అర్పించారు. హకీంపేట్లో ఆర్మీ సైనిక వందనం సమర్పించిన అనంతరం ఓఆర్ఆర్ మీదుగా సంతోష్ పార్థీవదేహాన్ని సూర్యాపేటకు తీసుకెళ్లునున్నారు. రేపు(గురువారం) కేసారంలోని వ్యవసాయ భూమిలో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7.45 గంటలకు సంతోష్ బాబు అంతమ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ సంతోష్ బాబు పార్థీవదేహాన్ని దర్శించుకోవాలిన అధికారులు సూచిస్తున్నారు.
Martyr Colonel Santosh dead body arrives at Hakimpet