- Advertisement -
అగర్తాలా: త్రిపుర అండర్19 మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అయంతి రియాంగ్ అనే క్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడింది. త్రిపుర జట్టు తరఫున ఆడుతున్న 16 ఏళ్ల అయంతి కిందటి రాత్రి తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ స్థానిక దినపత్రిక వార్తను ప్రచురించింది. అయంతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. త్రిపుర రాజధాని అగర్తాలా నుంచి 90 కిలో మీలటర్ల దూరంలో ఉన్న ఉదయ్పూర్ ప్రాంతానికి చెందిన అయంతి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించింది. నిరు పేద కుటుంబంలో పుట్టిన అయంతి మంచి క్రికెటర్గా పేరు తెచ్చుకుంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన అయంతి అర్ధాంతరంగా తనువు చాలించడంపై త్రిపుర క్రికెట్ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
Tripura Under-19 Women Cricketer Suicide
- Advertisement -