- Advertisement -
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పిఎ గా పనిచేస్తున్న దామోదరన్(56) కరోనాతో మంగళవారం రాత్రి మృతి చెందారు. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ కేడర్ అయిన దామోదర్ వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆయన మొదట ఒమందురార్ ఎస్టేట్ లోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. తరువాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. అక్కడ నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి, మళ్లీ రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయారు. దీంతో ఆయనతో సన్నిహితంగా ఉండే 200 మంది ఉద్యోగులకు వైద్య చికిత్స చేస్తున్నారు.
Tamil Nadu CMs PA Died due to Corona
- Advertisement -