Saturday, May 4, 2024

మహారాష్ట్ర ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా మహద్ ఎంఐడిసిలోని ఫార్మా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికి తీయగలిగారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. బ్లూజెట్ హెల్త్ కేర్ అనే కంపెనీకి చెందిన ఈ ఫ్యాక్టరీ లో ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ దాదాపు 12 మంది పనిచేస్తున్నారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు తలెత్తి, కెమికల్స్ ఉన్న బ్యారెల్స్ వైపు వ్యాపించడంతో ప్రమాదం తీవ్ర స్థాయికి చేరుకుందని తెలుస్తోంది. గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News