Tuesday, May 21, 2024

ఈసారి ఐపిఎల్ కష్టమే!: రాజీవ్ శుక్లా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కనోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో ఈ ఏడాది ఐపిఎల్‌ను నిర్వహించడం కష్టమేనని లీగ్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి స్థితిలో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం అంత తేలికకాదన్నారు. ఆటగాళ్లు, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి టోర్నీని జరపాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ఇప్పటి వరకు టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగడం లేదని వివరించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఐపిఎల్ జరుగుతుందా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఇటు నిర్వహణ కమిటీ కానీ, అటు ఫ్రాంచైజీల యాజమాన్యాలు కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేసేందుకు సాహసించడం లేదన్నారు. తాజా పరిస్థితులను గమనిస్తే ఈ ఏడాది ఐపిఎల్ జరిగే అవకాశాలు అంతంత మాత్రమేనని శుక్లా స్పష్టం చేశారు.

May be Impossible to held IPL 2020: Rajiv Shukla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News