Wednesday, May 1, 2024

రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. మయాంక్ అర్థసెంచరీ

- Advertisement -
- Advertisement -

 

వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన మయాంక్ రెండో రెండు ఇన్నింగ్స్ లో కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా(14), నయా వాల్ చటేశ్వర పుజారా(11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపర్చారు. ప్రస్తుతం భారత్ 39 ఓవర్లు ముగిసేసిరికి రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(60), కెప్టెన్ విరాట్ కోహ్లీ(12)లు ఉన్నారు.

Mayank Agarwal hits 50 Runs against New Zealand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News