Friday, May 3, 2024

పంతుళ్లమ్మకు పంచ్… కారుతో పారిపోయిన ఎంబిఎ పట్టభద్రుడు

- Advertisement -
- Advertisement -

MBA graduates ecape with Professors car at Bhopal

 

భోపాల్: ఎంబిఎ పట్టభద్రులు కారు మెకానిక్‌గా ప్రొఫెసర్ వద్దకు వచ్చి ఆమె కారుతో పారిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దీపక్ శర్మ(30), చైతన్య కుమార్ అనే ఎంబిఎ పట్టభద్రులు ప్రొఫెసర్ షీనా థామస్‌కు ఫోన్ చేసి కారుకు ఫ్రీ సర్వీస్ చేస్తామని చిరునామా ఇవ్వాలని అడిగారు. ప్రొఫెసర్ ఇంటికి మెకానిక్ దుస్తువులు ధరించి వచ్చారు. కారు ముందు నిలబడమని ప్రొఫెసర్‌కు చెప్పి ఫోటో తీసుకున్నారు. కారు డాక్యుమెంట్లు, ఫోన్ తీసుకొని టెస్టు డ్రైవ్ చేస్తామని ఆమెను నమ్మించారు. కారుతో వాళ్లు బయటకు వెళ్లి రాకపోయేసరికి ఆమె షాపూరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసి ఆరు గంటల్లో వారిని పట్టుకున్నారు. ఇండోర్‌కు వెళ్లిన తరువాత నకిలీ నంబర్ కారు తగిలించి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. పోన్ నంబర్ ట్రేస్ చేయడంతో వారిని గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News