Sunday, April 28, 2024

టిఆర్ఎస్ లో చేరిన మీర్ పేట్ బిజెపి కార్పొరేటర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపికి రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మీర్ పేట్ 13వ వార్డు కార్పొరేటర్ మొక్క నరేంద్రకుమార్ సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ”ప్రభుత్వ విధానాలే టిఆర్ఎస్ పార్టీ విజయ సోఫానాలు. ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టితో చేపడుతున్న కార్యక్రమాలకు విశేష ఆదరణ.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి అందరి చూపు టిఆర్ఎస్ వైపే ఉంది. తెలంగాణ సాధించిన పార్టీగా, టిఆర్ఎస్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా పని చేస్తుంది. తెలంగాణ ప్రజలందరి ఇంటి పార్టీ టిఆర్ఎస్ మాత్రమే. రాష్టాన్ని సాధించి, అందరికంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టం. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి పాలనను చూసి చాలా మంది టిఆర్ఎస్ లోకి చేరటానికి ఉత్సహం చూపుతున్నారు” అని అన్నారు. డివిజన్ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనునిత్యం ప్రజల్లో ఉంటూ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులు అయి పార్టీలో చేరుతున్నట్లు తెల్పిన కార్పొరేటర్ నరేంద్రకుమార్ పేర్కొన్నాడు.

Meerpet Corporater joins in TRS Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News