Sunday, May 12, 2024

దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 6822 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ తగ్గముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,531 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 315మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.47కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,79,997మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 75,841 కరోనా యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.40 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 141కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

India Reports 6531 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News