Tuesday, April 30, 2024

కెసిఆర్‌తో మేఘాలయ సిఎం సంగ్మా భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సిఎం సంగ్మాను ముఖ్యమంత్రి కెసిఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సిఎంలు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు.

అనంతరం సిఎం సంగ్మాను సిఎం కెసిఆర్ శాలువాతో సత్కరించి,మెమొంటోను బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎంకు సిఎం కెసిఆర్ వీడ్కోలు పలికారు. ఈ భేటీలో మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బిఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె.వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.KCR and Sangma

Sangma and KCR 1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News