Friday, April 26, 2024

మంత్రి గంగులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య(85) ఇటీవల మృతి చెందారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి కమలాకర్ నివాసానికి వెళ్ళి, మల్లయ్య గారి చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి కమలాకర్ ని పరామర్శించారు. మల్లయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News