- Advertisement -
హైదరాబాద్: ఇటీవల కరోనా బారిన పడ్డ హీరో చిరంజీవిని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. గురువారం స్వయంగా ఫోన్ చేసిన మంత్రి చిరు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, డాక్టర్లు సూచించిన చికిత్స ప్రోటోకాల్ను సమర్థవంతంగా పాటిస్తే చాలని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనే ముందు చిరంజీని కోవిడ్ టెస్టు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్ తేలగా తానే స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు.
minister etela Rajender phone to hero Chiranjeevi
- Advertisement -