Sunday, April 28, 2024

దుర్గమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్: ఏడుపాయల లో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున మంత్రి హరిశ్ రావ్ పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్ రెడ్డి వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రి కి స్వాగతం పలికారు. వనదుర్గ సన్నిధి లో ప్రత్యేక మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి,మదన్ రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తుందని,తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నమన్నారు.

సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని,యాదాద్రి ని అద్భుతంగా తీర్చిదిద్దామని,అలాగే కొండగట్టు అభివృద్థికి రూ 1000 కోట్లు కేటాయించమని ఆయన అన్నారు రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తుందని,రాష్ట్ర ప్రజలు గర్వించే సిఎం కెసిఆర్ అన్నారు.ప్రభుత్వ బడ్జెట్ లో దేవాలయ అభివృద్ధి కి కృషిచేస్తున్నాం. వేద పండితులు,బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, హిందుధర్మ పరి రక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది.రాబోయే రోజుల్లో ఏడుయలను పర్యాటక క్షేత్రంగా కృషిచేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News