Friday, April 26, 2024

దావోస్ దమాఖా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు

ముగిసిన కెటిఆర్ దావోస్
పర్యటన ప్రత్యేక
ఆకర్షణగా నిలిచిన
తెలంగాణ పెవిలియన్
ప్రపంచ వేదికపై రాష్ట్ర
విధానాలను, పెట్టుబడి
అవకాశాలను
ప్రతిభావంతంగా
వివరించిన మంత్రి
పర్యటన పట్ల పూర్తి
సంతృప్తి సహకరించిన
వారందరికీ ధన్యవాదాలు
తెలిపిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో లండన్, దావాస్‌లో జరిపిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటన సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రానికి రూ. 4200 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పర్యటనలో కెటిఆర్ 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు. ఈ నెల 18వ తేదీన లండన్‌కు చేరుకున్న ఆయన 22వ తేదీ వరకు అక్కడే ఉన్నారు. అనంతరం దావోస్‌కు చేరుకుని 23 నుంచి 26వ తేదీ వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన పలు సదస్సులో పాల్గొన్నారు. భారతదేశం నుంచి దావోస్‌లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్‌లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారత దేశానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు సైతం మన రాష్ట్ర పెవిలియన్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ పెవీలియన్ మంత్రి కెటిఆర్ పలు సంస్థలతో సమావేశాలతో పాటు పలు చర్చ గోష్ఠిలకి వేదికగా మారింది. ముఖ్యంగా కెటిఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సిఐఐ పెవిలియన్ లలో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులలో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఆయా చర్చల్లో మంత్రి కెటిఆర్ తన ప్రసంగాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలకు ప్రశంసలు లభించాయి.

కాగా ప్రపంచ వేదికపైన తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ఎన్నారైలకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

జ్యురిక్ నగరంలో జెడ్‌ఎఫ్ కంపెనీతో సమావేశమైన కెటిఆర్

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో జెడ్‌ఎఫ్ కంపెనీతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. సుమారు మూడు వేల మంది ఉద్యోగులతో తన హైదరాబాద్ కార్యాలయం తన అతిపెద్ద కార్యాలయంగా మారుతుందని ప్రకటించింది. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రారంభించబోతున్న నూతన క్యాంపస్ తో తన అతిపెద్ద కార్యాలయంగా హైదరాబాద్ నగరం ఉండబోతుందని తెలిపింది. ఈ మేరకు జూన్ 1వ తేదీన తన కార్యాలయాన్ని నానక్‌రామ్‌గూడాలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి కెటిఆర్‌కు తెలిపింది. జెడ్‌ఎఫ్ కంపెనీ విస్తరణతో రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతోందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో జెడ్‌ఎఫ్ కంపెనీ విస్తరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News