- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాష్ట్ర ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ దంపతులు ఓటుహక్కు వినియోగించుకు న్నారు. బంజారాహిల్స్లోని నందినగర్ జిహెచ్ఎంసి కమిటీ హాల్లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా వెళ్లిన మంత్రి పోలింగ్బూత్ 8లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే వాళ్లకు మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. దయచేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటువేసి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ ప్రారభం కావడంతో ప్రముఖులు ముందుగానే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలో ఓటువేశారు. ఓటు వేయకుండా ఎవరూ ఇంట్లో కూర్చోవద్దని కిషన్ రెడ్డి కోరారు.
- Advertisement -