- Advertisement -
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నర్సింహయ్య నిలిచిపోతారని సిఎం పేర్కొన్నారు. నర్సింహయ్య మరణం టిఆర్ఎస్, నాగార్జునసాగర్ ప్రజలకు తీరనిలోటన్నారు. నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో నోముల వెంటనే హైదరాబాద్ ఎంఎల్ఎ క్వార్టర్స్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. నోముల మృతి పట్ల సభాపతి పోచారం, మంత్రి కెటిఆర్,హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.
CM KCR mourns Nomula Narsimha Death
- Advertisement -