- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 4.2 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. జిహెచ్ఎంసిలో మొత్తం 150 డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 1,122 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
4.2 per cent polling in GHMC polls till 9 am
- Advertisement -