Friday, May 3, 2024

మీది రైతు బంద్

- Advertisement -
- Advertisement -

Minister Niranjan Reddy Comments on PM Kisan Yojana

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కొత్తవారికి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుబంధు పథకంలో 66 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, పిఎం కిసాన్ సమ్మాన్ యోజ న కింద ఏడాదికి రూ.6 వేలు మాత్రమే 35.74 లక్షల మందికి అందజేస్తున్నారని మంత్రి తెలిపారు. ‘రైతుబంధు పథకం ఈ వానాకాలంతో రూ.58 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాలలో వేశాం. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇప్పటి వరకు రైతులకు అందింది రూ.7689 కోట్లు మాత్రమే అన్నారు. కొత్తవారి నమోదుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఫిబ్రవరి 2019 త ర్వాత కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదన్నా రు. 2024 వరకు కొత్త వారికి ఆ పథకంలో అవకాశం లేదన్నారు. ఆదాయం పన్ను కట్టినా, రూ. 10వేల పెన్షన్ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం ఉ న్నా, పదవీ విరమణ చేసినా, తమ అసోసియేషన్లలో నమోదు చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఛార్టెడ్ అకౌంటెట్లు ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనకు అనర్హులు.

రైతుబంధు గురించి,  రైతుల ప్రయోజనాల గురించి రంకెలు వేసే తెలంగాణ బిజెపి నేతలు ఈ విషయంలో ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. కొత్తవారికి ఈ పథకం వర్తించేలా ఎందుకు కృషి చేయరు. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల కోట్లు రైతుబంధు కింద, ఏడాదికి రూ.1500 కోట్లు రైతుబీమాకు వెచ్చిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఇచ్చేది కేవలం రూ.2200 కోట్లకు మించింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి గరిష్టంగా కేటాయించిన బడ్జెట్ ఎన్నడూ రూ.3 వేల కోట్లకు మించలేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో ఏడాదికి రూ.15 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి వేస్తున్నారు. రైతుబీమాతో రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. గతంలో వ్యవసాయ రంగ పథకాలు అన్నీ కలిపితే మండలంలో లబ్ధిదారులు కేవలం 200 నుంచి 500 లోపు మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. రైతుబంధు పథకం ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు నేరుగా సాయం అందుతున్నది. అటవీ చట్టం ఆధీనంలో ఉన్న రైతుల భూములకు రైతుబంధు సాయం అందించడం జరుగుతున్నది. రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాలలో వేయడంతో రైతులు ఆ డబ్బులను తన వ్యవసాయ అవసరాల మేరకు వాడుకునే అవకాశం ఉందన్నారు. కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చేది తక్కువ.. ప్రచారం ఎక్కువ. కేంద్రం అడ్డగోలు నిబంధనల మూలంగా ప్రతి విడతలో 30 లక్షల మంది తెలంగాణ రైతులకు ఆ పథకం అందడం లేదు. ఎరువుల మీద సబ్సిడీలు తగ్గిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఎరువులు, రసాయనాల ధరలు రెట్టింపు అయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ వ్యవసాయరంగంలో యంత్రాల వినియోగంపై భారం మోపుతున్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ.. రైతుల పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేయడంలో విజయవంతం అయ్యారని మండిపడ్డారు. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో నిబంధనలు వెంటనే సడలించాలి. ప్రతి రైతుకూ ఈ పథకం వర్తింపజేయాలి. బిజెపి నేతలు మందికి సుద్దులు చెప్పడం మానేసి ప్రధానమంత్రికి చెప్పి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.” అని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News