Friday, April 26, 2024

స్థంభాద్రి ఆలయంలో మంత్రి పువ్వాడ అజయ్ పూజలు

- Advertisement -
- Advertisement -

Minister Puwada Ajay Pujas at Sthambhadri Temple

ఖమ్మం: నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఖమ్మం నగరంలోని సుప్రసిధ్ద వైష్ణవ క్షేత్రం, స్వయంభూ స్తంభాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయం(గుట్ట)లో శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనకు ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ సిబ్బంది పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ఆలయంలో సుమారు గంటసేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2021నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడ్ని కోరుకున్నట్లు చెప్పారు.

పేదలు, రైతు సంక్షేమం కోసం రాష్ట్రాభివృధ్ది కోసం నిరంతరం పనిచేస్తున్న సిఎం కెసిఆర్‌కు ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరినట్లు తెలిపారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకున్నట్లు పువ్వాడ పేర్కొన్నారు. అనంతరం అక్కడే ఉన్న శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి, క్షేత్రపాలకుడు శ్రీఆంజనేయస్వామివారికి కూడా పూజలు నిర్వహించారు. చివరగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామి వారి శేషవస్త్రాన్ని , ప్రసాదాలను మంత్రికి అందజేసారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, గోలి వెంకటేశ్వర్లు, ఆలయ ఇఓ కొత్తూరి జగన్మోహనరావు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News