Sunday, April 28, 2024

మెడికో విద్యార్థిని ప్రీతిని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: నిమ్స్ హాస్పటల్ చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. అనంతరం మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడారు. కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నం సంఘటన చాలా బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘ‌టనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేప‌డుతోందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ వరంగల్ కమిషనర్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. వైద్యులతో గంట గంటకు మంత్రి హరీష్ రావు స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షిస్తున్నారు అని మంత్రి తెలిపారు. సిఎం కేసీఆర్ నిమ్స్ డైరెక్టర్ ను, వైద్య బృందాన్ని ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యుల‌ను ఆదేశించారని వెల్లడించారు. ప్రీతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతానికి వెంటిలేటర్, ఏఖ్మో మీద ఉన్నారని, సి ఆర్ ఆర్ టి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్లినప్పుడు వారి మాటలకు ప్రీతి కళ్ళు తెరిచి చూడగలుగుతుందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రీతి ఆరోగ్యంగా కోలుకొని క్షేమంగా బయటకు రావాలని మంత్రి భగవంతున్ని ప్రార్థించారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్ర‌భుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News