Saturday, September 21, 2024

బోనాల పండుగ నాటికి అభివృద్ది పనులు పూర్తి చేయాలి: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani Inspects Bonalu Festival 2022

హైదరాబాద్: నగంంలో బోనాల వేడుకలు ప్రారంభవ నాటికి అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులు పూర్తి చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్‌లోని బాటా నుండి ఓల్డ్ రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ వరకు రూ. 92 లక్షల వ్యయంతో చేపట్టిన విడిసిసి రోడ్డు నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్ ఎండి దాన కిషోర్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రిఈ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న వివిధ కాలనీలు, బస్తీలకు వెళ్ళే అంతర్గత రహదారుల లెవెలింగ్ లో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీవరేజ్ పనులను కారణంగా కొద్ది మేర రోడ్డు పనులు నిలిచిపోవడంతో వెంటనే ఆ పనులను పూర్తిచేయాలని వాటర్ వర్క్ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన సంస్కృతిని చాటి చెప్పేవి పండుగలని, అందులో తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచేది బోనాల ఉత్సవాలు అని తెలిపారు. ఈ నెల 30 నుండి ఆషాడ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానుండగా జులై 17న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఉంటాయన్నారు.

ఈ మహంకాళి బోనాలకు లక్షలాదిగా భక్తులు వస్తారని, అందుకు తగినట్లుగా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మహంకాళి దేవాలయం నుండి ఎంజి రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు కాలినడకన బయలుదేరి మార్గమధ్యలో మంత్రి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మహంకాళి అమ్మవారి ఆర్చిని పనులను పరిశీలించారు. అక్కడి నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని పరిసరాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎంతో చరిత్ర కలిగిన గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ పనులను ఆగస్టు 15 వ తేదీ వరకు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఇ అనిల్ రాజ్, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్ జిఎంరమణా రెడ్డి, కార్పొరేటర్ లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News