Thursday, May 16, 2024

మిస్ ఇండియాగా మన తెలంగాణ సుందరి

- Advertisement -
- Advertisement -
Miss India 2020 winner is Manasa Varanasi from Telangana
మానస వారణాసికి దక్కిన కిరీటం

ముంబయి: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఇంజనీర్ మానస వారణాసి విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని గెలుచుకున్నారు. హర్యానాకు చెందిన మానికా షియోకండ్ విఎల్‌సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ఎంపిక కాగా విఎల్‌సిసి ఫెమీనా మిస్ ఇండియా 2020 రన్నర్-అప్‌గా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మాన్య సింగ్ నిలిచారు. బుధవారం విజేతలను జ్యూరీ ప్రకటించింది. జ్యూరీ సభ్యులుగా సినీ నటులు నేహా ధుపియా, చిత్రాగంద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ ద్వయం ఫల్గుని, షేన్ పీకాక్ వ్యవహరించారు. అందాల పోటీల మొదటి రౌండ్‌ను మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు ప్రారంభించారు. విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 సహసమర్పకులుగా సెఫోరా, రోపోసో వ్యవహరిస్తున్నాయి. గ్రాండ్ ఫినాలే ఫిబ్రవరి 28న కలర్స్ టివి చానల్‌లో ప్రసారమవుతుంది.

Miss India 2020 winner is Manasa Varanasi from Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News