Friday, May 3, 2024

మిషన్ కాకతీయనే అమృత్ సరోవర్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోషల్ మీడియాలో మిషన్ కాకతీయ గురించి హరీష్ రావు వీడియో పోస్టు చేశారు. అమృత్ సరోవర్‌గా మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగా అమలవుతోందని, తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందన్నారు. గతంలో చెరువులు ఎండిపోయి కనిపించేవని…  నేడు నిండు కుండల్లా చెరువులు హరీష్ రావు ప్రశంసించారు. గతంలో చెరువుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కాకతీయులు గొలుసు కట్టు ద్వారా చెరువులు నిర్మించారని, ఇప్పుడు సిఎం కెసిఆర్ గొలుసు కట్టు పద్దతిలో చెరువులో నిర్మించి నీళ్లు ఉండేలా చేశారని కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఊరూరా చెరువుల పండుగ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో డప్పులు, బోనాలు, బతుకుమ్మలతో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News