Saturday, May 4, 2024

ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలి: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ కవితను బాజిరెడ్డి గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా కవిత అన్నారు. సిఎం కెసిఆర్ మార్గ దర్శకత్వంలో, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆర్టీసి ప్రజలకు మరింత చేరువకావాలని, ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె అన్నారు.

MLA Bajireddy Govardhan meets MLC Kavitha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News