Sunday, April 28, 2024

ఆస్ట్రేలియా చేరుకున్న ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -
బ్రిస్బేన్ నగరంలో ఘన స్వాగతం పలికిన
బిఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు

హైదరాబాద్ : భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం చేరుకున్న ఎంఎల్‌సి కవితకు భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన స్వాగతం పలికారు. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల నుండి బిఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు వందల సంఖ్యలో తరలివచ్చి ఎంఎల్‌సి కవితకు స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అందెం, బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి,బిటిఎ ప్రెసిడెంట్ కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి రెడ్డి, ఇతర నాయకులు కవితకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిరంలో జరగనున్న బోనాలు వేడుకల్లో ఎంఎల్‌సి కవిత, ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపిలు పాల్గొననున్నారు. హలో బ్రిస్బేన్….ఆస్ట్రేలియాలో ఉన్న తెలంగాణకు చెందిన సోదరసోదరీమణులను కలిసి గడిపే సమయం కోసం ఎదురుచూస్తున్నా అంటూ ఎంఎల్‌సి కవిత ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News