Sunday, April 28, 2024

తెలంగాణ హక్కుల కోసం ఎక్కడ ప్రశ్నించారు రాహుల్: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha tweet on Rahul Gandhi tour

హైదరాబాద్: తెలంగాణ అంశాలు, హక్కులను పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు ఎందుకు  ప్రశ్నించలేదని ఎంఎల్ సి కవిత నిలదీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.  తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు.  దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని అడిగారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జిఎస్ టి బకాయిలు, నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని చురకలంటించారు.  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు ?? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా, వంటి పథకాలపై ఆరాతీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో, తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి కవిత సూచించారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలుచేస్తున్నాయన్నారు. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి రాహుల్ కు కూడా తెలంగాణకు స్వాగతం పలుకుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News