- Advertisement -
ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోడీ సంభాషణ
న్యూఢిల్లీ : ఫిట్ ఇండియా కార్యక్రంలో భాగంగా భారత్లోని ఫిట్నెస్ ఐకాన్లతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిలింద్ సోమన్ సహా పలువురితో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూట్రిషియన్ దివాకర్తో ప్రధాని మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని, తన డైట్ రహస్యాన్ని వెల్లడించారు. ‘వారానికి రెండు రోజులు మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది. నా మంచి చెడులు తెలుసుకుంటుంది. ఫోన్ చేసినప్పుడల్లా ప్రతిరోజు ‘పసుపు వాడుతున్నావా’? అని కచ్చితంగా అడుగుతుంది. నేను కూడా సోషల్ మీడియాలో పసుపు వాడకంపై తరచూ మాట్లాడుతుంటా’ అని ప్రధాని మోడీ రాజుతా దివాకర్ తో అన్నారు.
- Advertisement -