Saturday, May 4, 2024

దేశమంతటా విస్తరించిన నైరుతి

- Advertisement -
- Advertisement -

నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. రాగల రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, జార్ఖండ్, గంగేటిక్ పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల రెండు మూడు రోజుల్లో అతివృష్టి కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని ఐఎండి తెలిపింది.

Also Read: 3 ఏళ్ల కిత్రం మహిళ అదృశ్యం… సెప్టిక్ ట్యాంక్‌లో అస్థిపంజరం…

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News