Tuesday, April 30, 2024

థేమ్స్ తరహాలో మూసీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన ప్రణాళికలపై లండన్‌లో థే మ్స్ రివర్ పాలక మండలితో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి విస్తృతంగా చర్చలు జరిపారు. మూసీ రివ ర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని వి జ్ఞప్తి చేశారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రం ట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశా ల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు. లండన్‌లో ని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అ భివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదా పు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కా ర్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ సిఎంకు వివరించారు. అందులో భాగంగా ఎదురైన సవా ళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అ నుసరించిన అత్యుత్తమ విధానాలను ఈ సందర్భంగా వారు చర్చించారు.
‘విజన్ 2050’కు అనుగుణంగా ప్రాజెక్టు
అక్కడి ‘నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెం దాయి. హైదరాబాద్ సిటీకి అటువంటి ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్ వై భవం తీసుకు వస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా భావించా రు. విజన్ 2050కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ అధికారులు సానుకూలతతో చర్చలు జరిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చినట్లు అక్క డి అధికారులు సిఎంకు వివరించారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే రెవెన్యూ మోడల్ ను ఎంచుకోవాలని వారు చెప్పారు. ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించటంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలని వారు సిఎం రేవంత్‌కు సూచించారు. హైదరాబాద్ లో మూసీనదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్ధతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఇదే సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లైన్, వివిధ సంస్థల భాగస్వా మ్యంపై చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్ధిష్టమైన సహకారం అందించేందుకు భవిష్యత్‌లో మరిన్ని చర్చలు జరపాలని ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, సిఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్‌ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలి, ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, మూసీ రివర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఎస్‌ఈ వెంకట రమణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News