Monday, May 6, 2024

ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ్ కథ

- Advertisement -
- Advertisement -

పవిత్రమైన అధిక్ సావన్ (శ్రావణ్) మాసాన్ని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామ్ కథ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి అతి పవిత్రమైన కార్యక్రమం ప్రారంభించారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు. జ్యోతిర్లింగ రామ్ కథ రైలు యాత్ర పేరుతో 2023 జూలై 22న ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన ఈ వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమం వారణాసి, జార్ఖండ్‌లలో జ్యోతిర్లింగ యాత్రను కవర్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఇప్పటికే కేదార్‌నాథ్, కాశీ విశ్వనాథ్, బైద్య నాథ్ లలో ముగించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని పవిత్రమైన మల్లికార్జున స్వామి చెంతకు చేరింది.

మొరారి బాపు 63 సంవత్సరాలుగా మహోన్నత గ్రంధాల సారాన్ని ప్రజలకు వివరిస్తూ తన నిష్కళంకమైన కథా నైపుణ్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఈ దూరదృష్టితో కూడిన మరియు విశిష్టమైన కార్యక్రమం దేశంలోని సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంపై అవగాహనను పెంపొందించడానికి, సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి, శ్రీరాముడు, జ్యోతిర్లింగాల బోధనల మధ్య బంధాన్ని వివరించడానికి చేపట్టబడింది. జూలై 22న కేదార్‌నాథ్‌లో ప్రారంభమైన ఈ యాత్ర 18 రోజుల పాటు సాగి, 8 ఆగస్టు 2023న గుజరాత్‌లోని బాపు గ్రామమైన తల్గజర్దా వద్ద ముగుస్తుంది.

పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయాలలో బాపు నుండి రామ్ కథపై జ్ఞానోదయం కలిగించే ఉపన్యాసాలను భక్తులు వింటారు. ఈ కార్యక్రమంతో, బాపు మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలనే తపనతో, సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని ప్రతిబింబించేలా, శ్రీరామ నామ వైభవాన్ని జరుపుకోవడానికి ఈ యాత్రను చేపట్టారు.

కైలాష్ భారత్ గౌరవ్, చిత్రకూట్ భారత్ గౌరవ్ అనే రెండు ప్రత్యేక రైళ్లు యాత్రను సులభతరం చేస్తున్నాయి. సనాతన ధర్మానికి చెందిన ప్రధాన ధామాలు, తిరుపతి బాలాజీ దేవాలయం, బాపు గ్రామంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ, రైళ్ల వెలుపలి భాగాలను అలంకరించారు. జ్యోతిర్లింగంతో పాటు, భక్తులు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఇతర ప్రదేశాలను సైతం సందర్శిస్తారు. ఈ యాత్ర ను ఇండోర్‌కు చెందిన బాపు పుష్పం (భక్తుడు) రూపేష్ వ్యాస్ ఆదేశ్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ జ్యోతిర్లింగ రామ్ కథా యాత్రను విజయవంతం చేయడానికి అతను IRCTCతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తర్వాత, మొరారి బాపు నేతృత్వంలోని ఈ యాత్ర తమిళనాడులోని రామేశ్వరానికి తరలిపోతుంది. దానితో పాటుగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగ రామ్ కథా యాత్ర దర్శనం కోసం తిరుపతి బాలాజీ ఆలయానికి వెళుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News